Share News

Donation: వరద బాధితులకు అపోలో సాయం

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:21 AM

వరద బాధితుల సహాయార్ధం అపోలో ఆస్పత్రుల యాజమాన్యం తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

Donation: వరద బాధితులకు అపోలో సాయం

  • ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): వరద బాధితుల సహాయార్ధం అపోలో ఆస్పత్రుల యాజమాన్యం తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సంబంధిత చెక్కును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అపోలో గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి శుక్రవారం అందజేశారు.


ఈ సందర్భంగా డాక్టర్‌ సంగీతారెడ్డి మాట్లాడుతూ... ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయని, ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది నిరాశ్రయులయ్యారని వారి సహాయార్థం తమ వంతుగా ఈ విరాళం ఇచ్చామన్నారు. ఈ సవాళ్ల సమయంలో తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 04:21 AM