Share News

Lok Sabha polls 2024: ఓటు వేసిన బండారు దత్తాత్రేయ

ABN , Publish Date - May 13 , 2024 | 01:43 PM

బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

Lok Sabha polls 2024: ఓటు వేసిన బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని, ఓటుతో మార్పు తేవచ్చని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలని కోరారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 01:43 PM