Share News

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:23 PM

హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది.

Hyderabad: హైదరాబాద్‌లో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
Begumpet Airport (File)

హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. ఎవరు మెయిల్ చేశారనేదానిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు బాంబు బెదిరింపు సమాచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బేగంపేట విమానశ్రయానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. విమానశ్రయం వైపు ఎవరినీ రానీయడం లేదు. నిజంగా బాంబు పెట్టారా.. లేదా ఎవరైనా ఆకతాయిలు మెయిల్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. గతంలోనూ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో, ప్రభుత్వ భవనాలు, స్థలాల్లో బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా భద్రతా అధికారుల తనిఖీల తర్వాత అవి ఫేక్ కాల్స్‌గా తేలాయి. ప్రస్తుతం బేగంపేట విమానశ్రయం వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించి.. తనిఖీలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jun 24 , 2024 | 02:31 PM