Share News

Secretariat: నేడు సీఎం చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహ ఆవిష్కరణ

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:52 AM

రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆవిష్కరించనున్నారు.

Secretariat: నేడు సీఎం చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహ ఆవిష్కరణ

  • పాల్గొననున్న ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 3.45 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.


ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Sep 16 , 2024 | 03:52 AM