Share News

Hyderabad: హౖకోర్టులో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:12 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హైకోర్టు ప్రాంగణాన్ని ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. పోలీసు బలగాలు ప్రత్యేక గౌరవ వందనంతో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధేకు స్వాగతం పలికాయి.

Hyderabad: హౖకోర్టులో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హైకోర్టు ప్రాంగణాన్ని ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. పోలీసు బలగాలు ప్రత్యేక గౌరవ వందనంతో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధేకు స్వాగతం పలికాయి. అనంతరం చీఫ్‌ జస్టిస్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ సహా అందరు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రజినీకాంత్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, కార్యదర్శి శాంతిభూషణ్‌రావు, న్యాయాధికారులు పాల్గొన్నారు. కాగా, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో టీపీసీసీ లీగల్‌సెల్‌, హ్యూమన్‌రైట్స్‌, ఆర్టీఐ విభాగం చైర్మన్‌ పొన్నం అశోక్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీ, ఏజీపీ, జీపీ, జిల్లా కోర్టుల్లోని ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపా

Updated Date - Jun 03 , 2024 | 04:12 AM