Share News

Hyderabad: బిర్యానీ కోసం వెళ్లిన ఫ్యామిలీని కర్రలతో కొట్టిన హోటల్ సిబ్బంది

ABN , Publish Date - Jan 01 , 2024 | 02:39 PM

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బిర్యానీ తినడానికి వెళ్లిన ఓ ఫ్యామిలీపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిర్యానీ బాగోలేదని చెప్పినందుకు చితకబాదడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Hyderabad: బిర్యానీ కోసం వెళ్లిన ఫ్యామిలీని కర్రలతో కొట్టిన హోటల్ సిబ్బంది

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బిర్యానీ తినడానికి వెళ్లిన ఓ ఫ్యామిలీపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళ్తే.. 8 మంది ఫ్యామిలీ సభ్యులు బిర్యానీ తినేందుకు అబిడ్స్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. అయితే వాళ్లు ఆర్డర్ చేసిన బిర్యానీ సరిగ్గా ఉడకలేదు. దీంతో ఫ్యామిలీ సభ్యులకు కోపం వచ్చి బిర్యానీ బాగోలేదని వెయిటర్లతో చెప్పారు. అయితే తమ బిర్యానీ బాగోలేదని చెప్పినందుకు హోటల్ సిబ్బంది సదరు ఫ్యామిలీతో వాగ్వాదానికి దిగారు. బిల్లు కట్టే సమయంలో ఈ గొడవ మరింత ముదిరింది.

ఈ నేపథ్యంలో తమ ఆహారంలో క్వాలిటీ లేదని ప్రశ్నించిన ఫ్యామిలీపై హోటల్ సిబ్బంది కర్రలతో దాడి చేశారు. వెయిటర్లు తమకు దొరికిన వస్తువులతో కటుుంబంపై దాడి చేసిన దృశ్యాలను కొందరు వీడియో తీయగా ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బిర్యానీ బాగోలేదని చెప్పినందుకు చితకబాదడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు ఇద్దరు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తానికి సదరు ఫ్యామిలీకి 2023 చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2024 | 02:39 PM