Share News

Hyderabad: రామయ్య బంగారు పాదుకలకు గవర్నర్‌ ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:23 AM

అయోధ్య రామ మందిరానికి భక్తుడు కానుకగా ఇస్తున్న బంగారు పాదుకలకు గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌(Governor Dr. Tamilisai Soundararajan) ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Hyderabad: రామయ్య బంగారు పాదుకలకు గవర్నర్‌ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామ మందిరానికి భక్తుడు కానుకగా ఇస్తున్న బంగారు పాదుకలకు గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌(Governor Dr. Tamilisai Soundararajan) ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి అయోధ్య రామమందిరానికి కానుకగా ఇచ్చేందుకు బంగారు పాదుకలు తయారు చేయించారు. ఆ పాదుకలకు గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామమందిరం గర్భగుడిలో ఉంచే బంగారు పాదుకల్ని ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని గవర్నర్‌ అన్నారు. శ్రీరాముడికి అంకితభావంతో శ్రీనివాస శాస్త్రి చేసిన సేవల్ని ఆమె కొనియాడారు. శ్రీరాముడి పాదుకలకు జరిపిన పూజా కార్యక్రమంలో రాజ్‌భవన్‌ అధికారులతోపాటు రాజ్‌భవన్‌ పరివార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 11:23 AM