Share News

Hyderabad: స్మితా సబర్వాల్‌ను తొలగించాలంటూ నిరసన

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:36 PM

దివ్యాంగులను అవమానపరిచిన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(IAS officer Smita Sabharwal)ను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెను అరెస్ట్‌ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు(Kolli Nageshwar Rao) డిమాండ్‌ చేశారు.

Hyderabad: స్మితా సబర్వాల్‌ను తొలగించాలంటూ నిరసన

హైదరాబాద్: దివ్యాంగులను అవమానపరిచిన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(IAS officer Smita Sabharwal)ను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెను అరెస్ట్‌ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు(Kolli Nageshwar Rao) డిమాండ్‌ చేశారు. బుధవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌(Lowertankbund)లో గల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదికూడా చదవండి: Amrapali: గోప్యంగా సమాచారం.. వ్యక్తిగత వివరాలు అవసరం లేదు


నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక నాయకులు జంగల్‌ శ్రీనివాస్‌, పి. శ్రీనివాస్‌, పులిపాటి శ్రీనివాస్‌, మల్లెల డేవిడ్‌, నరసింహారెడ్డి, మాధవి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

city5.2.jpg


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2024 | 12:36 PM