Share News

TS News: చంచల్ గూడ జైల్లో ఖైదీ అనుమానాస్పద మృతి..

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:21 PM

హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కిస్మత్ పూర్‌కు చెందిన ముడావత్ రాజును గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిలో దొంగతనం చేసిన కేసులో ముడావత్ రాజు, శ్రీనులు నిందితులుగా ఉన్నారు.

TS News: చంచల్ గూడ జైల్లో  ఖైదీ అనుమానాస్పద మృతి..

హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కిస్మత్ పూర్‌కు చెందిన ముడావత్ రాజును గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిలో దొంగతనం చేసిన కేసులో ముడావత్ రాజు, శ్రీనులు నిందితులుగా ఉన్నారు. వారెంట్ ఉండడంతో రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్ గూడ జైల్‌కు తరలించారు. సోమవారం ఉదయం రాజు చనిపోయాడంటూ అతని కొడుకుకు పోలీసులు ఫోన్ చేశారు. దీంతో రాజు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 12 , 2024 | 12:21 PM