Share News

గుంతలమయంగా బైపాస్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:30 AM

గత వారంరోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి నగరంలోని బైపాస్‌ రోడ్డు గుంతలమయంగా మారింది. కరీంనగర్‌-సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తారు రోడ్డు దెబ్బతిన్నది. పద్మనగర్‌ శివాజీ జంక్షన్‌లో ఏర్పడ్డ భారీ గుంతలతో రోడ్డు ప్రమాదకరంగా మారింది.

గుంతలమయంగా బైపాస్‌

కరీంనగర్‌ టౌన్‌, జూలై 26: గత వారంరోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి నగరంలోని బైపాస్‌ రోడ్డు గుంతలమయంగా మారింది. కరీంనగర్‌-సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తారు రోడ్డు దెబ్బతిన్నది. పద్మనగర్‌ శివాజీ జంక్షన్‌లో ఏర్పడ్డ భారీ గుంతలతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. గతంలో ఇదే జంక్షన్‌లో జరిగిన ప్రమాదంలో ఒక ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగాయి. ఈ జంక్షన్‌లో రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా త్వరాగానే దెబ్బతింటుంది. బైపాస్‌ మీదుగా హైదరాబాద్‌, వరంగల్‌ వైపు భారీ వాహనాల్లో గ్రానైట్‌, ఇసుక, మట్టిని తరలిస్తారు. ఈ రోడ్డుకు శాశ్వతంగా మరమ్మతులు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షాలకే జంక్షన్‌లో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. పెద్ద గుంతల్లో పడి పలువురు ద్విచక్రవాహనదారులు గాయాలపాలవుతున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడకుండా పటిష్టంగా రోడ్డు వేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. జంక్షన్‌ సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:30 AM