Share News

ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:26 AM

హుజూరాబాద్‌ ఏసీపీ కార్యాలయాన్ని సీపీ అభి షేక్‌ మొహంతి గురు వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పై సమీక్షించి, వాటికి గల కారణాలను ఏసీపీ శ్రీనివా స్‌జీని అడిగి తెలుసుకొని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

హుజూరాబాద్‌, జూలై 25: హుజూరాబాద్‌ ఏసీపీ కార్యాలయాన్ని సీపీ అభి షేక్‌ మొహంతి గురు వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పై సమీక్షించి, వాటికి గల కారణాలను ఏసీపీ శ్రీనివా స్‌జీని అడిగి తెలుసుకొని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ విసిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. సైబ ర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలకు అధికారులు అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్‌జీ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:26 AM