Share News

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం

ABN , Publish Date - May 09 , 2024 | 12:35 AM

పదేళ్లు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలను దోచుకున్నాయని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూపాల్‌ అన్నా రు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం

గోదావరిఖని, మే 8: పదేళ్లు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలను దోచుకున్నాయని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూపాల్‌ అన్నా రు. బుధవారం గోదావరిఖ నిలోని ఒక ప్రైవేట్‌ ఫంక్ష న్‌హాల్‌లో సీపీఎం ఏర్పా టు చేసిన విస్తృత సమావే శానికి వారు హాజరై మా ట్లాడారు. గత పదేళ్ల నుం చి కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం అధికారంలో ఉండి చేసిందేమి లేదని, పెట్టుబడిదారుల సంపదలను రెట్టింపు చేయడానికే మోదీ ప్రభుత్వం పని చేసిం దని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను అదాని, అంబానీలకు కట్టబెట్టాయని, దేశ ఆర్థిక వ్యవస్థను వారి స్వలాభం కోసం బీజేపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువా త మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయని, 3వ సారి అధికారంలోకి రావడానికి అయోధ్యలో రా ముని విగ్రహం ప్రతిష్ఠ చేసి మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. పెద్దపల్లి ఇండి యా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, సీపీఎం నాయకులు యాకయ్య, తుమ్మల రాజారెడ్డి, సంకె రవి, సాయిలు, కుమారస్వామి, జ్యోతి, గణేష్‌, అశోక్‌, రామాచారి, ముత్యంరావు, శైలజ, అశోక్‌, శం కర్‌, లక్ష్మారెడ్డి, మహేష్‌, రాజు, శ్రీకాంత్‌, శంకర్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:35 AM