Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : కోదండరాం

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:17 AM

తన పదవిని బాఽధ్యతగా భావించి ప్రజా సమస్యలను చట్టసభలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : కోదండరాం

చిక్కడపల్లి, కవాడిగూడ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తన పదవిని బాఽధ్యతగా భావించి ప్రజా సమస్యలను చట్టసభలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అన్నారు. టీజేఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ అధ్యక్షుడు ఎం.నరసయ్య ఆధ్వర్యంలో బుధవారం త్యాగరాయ గానసభలో కోదండరామ్‌కు ఆత్మీయ పౌర సన్మాన సభను నిర్వహించారు.


ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని వర్గాలు, సమూహాలు, ఉద్యమకారులు, సంఘాలతో కలిసి ఎప్పటిలాగే పనిచేస్తానన్నారు. ప్రొ.జయశంకర్‌ సమకాలీకుడు చంద్రశేఖర్‌, నరసయ్య, టీజేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బద్రుద్దీన్‌, తదితరులు మాట్లాడారు. అంతకు ముందు లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మకు కోదండరాం పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక ఓపెన్‌టా్‌ప జీపులో ఆయనను ఊరేగింపుగా లోయర్‌ ట్యాంక్‌బండ్‌, మీదుగా త్యాగరాయ గానసభకు తీసుకెళ్లారు.

Updated Date - Sep 05 , 2024 | 05:17 AM