Share News

మరోసారి మోదీనే ప్రధాని

ABN , Publish Date - May 08 , 2024 | 11:09 PM

సొంత మెజార్టీతో మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు.

మరోసారి మోదీనే ప్రధాని
మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు

- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు

నారాయణపేట టౌన్‌, మే 8 : సొంత మెజార్టీతో మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఈశాన్య రాష్ర్టాల్లో ఒకప్పుడు ఉగ్రవాదం ఉండేదని, ఇప్పుడు ఉగ్రవాద రహిత దేశంగా భారత్‌ మారిందన్నారు. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్‌ అని, ఆ నాడు పాకిస్తాన్‌ ఏర్పాటుకు కారణమయ్యిందే కాంగ్రెస్‌ అన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని, దేశంలో రిజిర్వేషన్లు పుష్కలంగా ఉంటాయన్నారు. అమెరికా, చైనా తర్వాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ మారిందన్నారు. కుంభకోణాల నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. గత పదేళ్లలో దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ కలిగన దేశంగా బీజేపీ అవతరించిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు సుమారు 280 స్థానాల్లో ఎంపీ ఎన్నికలు పూర్తి అయ్యాయని, ఈనెల 10న పేట మినీ స్టేడియం మైదానంలో జరిగే ఎన్నికల ప్రచార సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరువుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, బంగారు శ్రుతి, రతంగ్‌ పాండురెడ్డి, కొండయ్య, ఎగ్గని నర్సింహులు, శ్రీనివాసులు, కొండా సత్యయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:09 PM