Home » Telangana » Mahbubnagar
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఆదివారం అతివేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఒకరు గాయపడగా, ఒక టీ స్టాల్, కిరాణం దుకాణం షట్టర్ ధ్వంసమయ్యాయి.
కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు గడిచిన 20 సంవత్సరాల నుంచి తనపై ఆదరాభిమానాలు చూపుతున్నారని, ప్రతీ ఎన్నికల్లో తన విజయం వెనుక నిలిచారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తనకు జన్మనిచ్చిన ఈ గడ్డలో భావి భారత పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడంతోనే వారి రుణం తీరుతుందని, అదే తన లక్ష్యమని చెప్పారు.
టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) సోమవారం నుంచి ఆన్లైన్ విధానంలో ప్రారంభం కానుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు డీఎస్సీ కోసం బీఎడ్, డీఎడ్, పండిట్ ట్రైనింగ్ చేసిన వారు మాత్రమే టెట్ రాసేవారు.
నిప్పు.. భూసారానికి ముప్పుగా మారుతోంది.. యాసంగి వరి కోతలు పూర్తికావడంతో వానాకాలం సాగు పనులను రైతులు ప్రారంభించారు.
ఉపాధి హామీ పథకం పనులకు రోజుకు రోజుకూ కూలీల సంఖ్య పెరుగుతోంది.
‘అమ్మ ఆదర్శ’ పాఠశాల పథకం కింద ప్రభుత్వ పాఠశాలల మరమ్మతుకు ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేసింది.
పెద్దవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తా ము చేస్తున్న పోరాటం ఆగదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు.
గద్వాల పట్టణ సమీపం లోని అయిజ-రాయచూర్ ఔటర్రింగ్ రోడ్డు పక్కన ఉన్న సగానికిపైగా విరిగి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని ఆ శాఖ అధికారులు ఆదివారం తొలగించారు.
ప్రజాహితానికి దైవ కార్య క్రమాలు దోహదపడుతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. దైవభక్తితో స త్రవర్తన, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.
ధనిక కుటుంబంలో పుట్టినా సమ సమాజ నిర్మాణే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం సాగించిన పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ వంతమైన ప్రజా నాయకుడని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట స్వామి కీర్తించారు.