Share News

Crime: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ABN , Publish Date - Jun 01 , 2024 | 08:14 AM

జోగులాంబ గద్వాల జిల్లా: ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం.. లారీని ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Crime: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

జోగులాంబ గద్వాల జిల్లా: ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం (Scorpio Vehicle).. లారీ (Lorry)ని ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి, ఒక చిన్నారి ఉన్నారు. కర్నూలు జిల్లా (Kurnool Dist.), ఆళ్లగడ్డ (Allagadda) నుంచి స్కార్పియో వాహనంలో ఏడుగురు.. హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న సమయంలో లారీని ఢీ కొని నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

లండన్ నుంచి విజయవాడకు చేరుకున్న సీఎం జగన్

బొగ్గులోడు లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి..

‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

మాకు మీరు.. మీకు మేము!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 01 , 2024 | 08:16 AM