సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
ABN , Publish Date - May 08 , 2024 | 11:13 PM
సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్కు పార్ల మెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు.
- కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలి : ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి
దామరగిద్ద, మే 8 : సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్కు పార్ల మెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం దామరగిద్ద మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి మాట్లాడారు. సాధ్యం కానీ హా మీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా తీసుకువచ్చిన రైతుబంధు పథకం నేటికీ రైతులు పంటకోస్తున్నా రైతులకు అందలేదన్నారు. వచ్చే దసరా పండుగలోపు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోడం, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని కి జాతీయ హోదా తీసుకొస్తానని పాలమూరు ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేసి ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి కోరారు. కార్యక్ర మంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామో దర్రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.