Share News

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

ABN , Publish Date - May 13 , 2024 | 12:05 PM

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నల్లొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు అనేది సామాన్యుల స్వరమని.. పాలకులని ప్రశ్నించేందుకు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని నేతలు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో, ఇతరాత్ర ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

Updated Date - May 13 , 2024 | 12:05 PM