Share News

MP Etala Rajender: ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం: ఈటల

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:22 AM

రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాటి ఊసే ఎత్తడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆరోపించారు.

MP Etala Rajender: ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం: ఈటల

హైదరాబాద్: రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాటి ఊసే ఎత్తడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆరోపించారు. మల్లాపూర్‌ వీఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ బాలచందర్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌ అసెంబ్లీ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... కాంగ్రెస్‌(Congress) సర్కారుపై అవిశ్వాసం ప్రకటించిన నిరుద్యోగ యువత యుద్ధం చేస్తున్నారని విమర్శించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: అరబ్‌ దేశాల్లో ఉద్యోగాలంటూ గాలం..


పీర్జాదిగూడలో 1985లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లను రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం కూల్చడం సరికాదన్నారు. ఉప్పల్‌లో 35 ఏళ్ల క్రితం పేదలు నిర్మించుకున్న ఇళ్లను వక్ఫ్‌ భూములు అంటూ ప్రభుత్వ స్థలాలుగా చెప్పడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎ్‌సఎ్‌స ప్రభాకర్‌, భేతి సుభాష్‏రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 10:22 AM