దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ రావాలి
ABN , Publish Date - May 08 , 2024 | 12:09 AM
దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ అన్నారు. మంగళవారం కోదాడలో జరిగి న జన సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షే మ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు.
రాజస్థాన్ రాష్ట్ర సీఎం భజన్లాల్శర్మ
కోదాడటౌన్, మే 7: దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ అన్నారు. మంగళవారం కోదాడలో జరిగి న జన సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షే మ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పేదల కోసం రూపాయి ఖర్చుచేస్తే, 15పైసలు కూడా వారికి లబ్ధి చేకూరలేదన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో పేదలపై ఖర్చు చేసే ప్రతీ రూపాయి వారికే చెందుతోందన్నారు. ఈనెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నిక ల్లో బీజేపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అమలు కాని హామీలు ఇస్తూ, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. వారి హామీలను ప్రజలు నమ్మే పరిస్థితులో లేరన్నారు. నల్లగొండ సీటును బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎంపీగా గెలిచాక పార్లమెంట్లో జిల్లా సమస్యలపై గళం విప్పుతానన్నారు. హైదరాబాద్-విజయవాడ ఫాస్ట్ ట్రైన్ మార్గం కోసం కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, బొబ్బ భాగ్యరెడ్డి, కనగాల నారాయణ, చీకోటి ప్రవీణ్, బొలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, యాదా రమేష్, సాతులూరి హనుమంతరావు, చౌడ శ్రీనివా్సరెడ్డి, శ్రీలతరెడ్డి, యశ్వంత్, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.