మోదీ నాయకత్వాన్ని మరోమారు బలపర్చాలి
ABN , Publish Date - May 08 , 2024 | 12:11 AM
: దేశం కోసం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని మరోమారు బలపర్చాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 9న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా భువనగిరి రాయిగిరిలో పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు
అమిత్షా బహిరంగ సభను విజయవంతం చేయాలి
బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్
భువనగిరి టౌ న్, మే 7: దేశం కోసం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని మరోమారు బలపర్చాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 9న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా భువనగిరి రాయిగిరిలో పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సాధించని ప్రగతి, పారదర్శకత, అవినీతిరహిత పాలనను పదేళ్లలో నరేంద్రమోదీ సాధించారన్నారు. ఇప్పటికే భువనగిరికి ఎయిమ్స్తో పాటు పలు ప్రాజెక్ట్లను మంజూరు చేసిందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. అమిత్షా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీ చాడ సురే్షరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాశం భాస్కర్, యన్నం శివకుమార్, ఊట్కూరి అశోక్గౌడ్, చందా మహేందర్గుప్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, పడాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.