Share News

Telangana : పాత కక్షలతో యువకుడి దారుణ హత్య

ABN , Publish Date - May 27 , 2024 | 03:26 AM

పాత కక్షలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామ శివారులో ఈ నెల 23న జరిగిన నందికొండ వెంకటేశ్‌(25) కిడ్నాప్‌ కేసు విషాదాంతమైంది.

Telangana : పాత కక్షలతో యువకుడి దారుణ హత్య

  • కిడ్నాప్‌ చేసి.. చంపి, నిప్పంటించి..

సూర్యాపేట రూరల్‌/మోతె, మే 26: పాత కక్షలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామ శివారులో ఈ నెల 23న జరిగిన నందికొండ వెంకటేశ్‌(25) కిడ్నాప్‌ కేసు విషాదాంతమైంది. గతంలో జరిగిన హత్యకు ప్రతీకారంగానే అతన్ని చం పినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.]

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపల్లెకు చెందిన వెంకన్న అలియాస్‌ వెంకటేశ్‌ మూడేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు.అదే అమ్మాయిని వెంకటేశ్‌ స్నేహితుడైన రాజశేఖర్‌ కూడా ప్రేమించాడు. అది మనుసులో పెట్టుకున్న వెంకటేశ్‌.. రాజశేఖర్‌ను చంపి, శవాన్ని భూమిలో పాతిపెట్టాడు.

ఈ కేసులో వెంకటేశ్‌కు జైలు శిక్ష పడగా.. ఏడాది క్రితం బెయిలుపై విడుదలయ్యాడు. సూర్యాపేట మండలం టేకుమట్లలోని పెద్దమ్మ ఇంట్లో ఉంటూ సూర్యాపేటలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 23న కిడ్నాప్‌ అయిన వెంకటేశ్‌.. మోతె మం డలం రాఘవాపురం వద్ద శవమై కనిపించాడు. పాత కక్షలతోనే వెంకటేశ్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - May 27 , 2024 | 03:30 AM