Share News

స్వాగత తోరణం కిందపడి మహిళ మృతి

ABN , Publish Date - May 09 , 2024 | 12:49 AM

జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణం తీవ్ర గాలులు, వర్షం కారణంగా కిందపడటంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌ సీఐ పవన్‌కుమర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

స్వాగత తోరణం కిందపడి మహిళ మృతి

మొయినాబాద్‌ రూరల్‌, మే 8: జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణం తీవ్ర గాలులు, వర్షం కారణంగా కిందపడటంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌ సీఐ పవన్‌కుమర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్నమంగళారంలో మూడు రోజులుగా బీరప్ప బోనాలు వేడుకలు జరుగుతున్నాయి. నిర్వాహకులు గ్రామ పరిధి ప్రారంభంలో స్వాగత తోరణాలను(బోర్డులను) ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం, ఈదులు గాలులుతో స్వాగత బోర్డు కిందపడిపోయింది. అదే సమయంలో కూరగాయలు కోనుగోలు చేయడానికి వెళ్లిన జహీరాబేగం(47)పై బోర్డు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె భర్త మహ్మద్‌ ఇబ్రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:49 AM