Share News

జర్నలిస్టుపై దాడి.. కేసు నమోదు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:49 PM

జర్నలిస్టుపై ఓ యువకుడు దాడిచేసిన సంఘటన మండల పరిధిలోని ముర్తుజగూడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు..

జర్నలిస్టుపై దాడి.. కేసు నమోదు

మొయినాబాద్‌, జూలై 26 : జర్నలిస్టుపై ఓ యువకుడు దాడిచేసిన సంఘటన మండల పరిధిలోని ముర్తుజగూడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ముర్తుజగూడ గ్రామానికి చెందిన గణేష్‌ ఓ దినపత్రికలో జిల్లా రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన మోసిన్‌ అనే యువకుడు గణేష్‌ ఇంటికి వచ్చి ఇంటి గేటును తన్నాడు. బూతులు తిడుతుండగా.. ఎందుకు తిడుతున్నావని గణేష్‌ అడిగాడు. దాంతో ఆ యువకుడు మారణాయుధంలో గణే్‌షపై దాడి చేసేందుకు యత్నించగా తప్పించుకున్నాడు. అప్పటికే రెండు కార్లలో కొంతమంది ఉన్నట్లు గమనించిన గణేష్‌.. పథకం ప్రకారమే జరుగుతున్నట్లు గమనించి డయల్‌ 100కు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చేసరికి ఒక కారులో ఉన్నవారు పారిపోగా.. మరో కారును స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:49 PM