Share News

TG News: బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా..

ABN , Publish Date - May 28 , 2024 | 01:13 PM

రంగారెడ్డి జిల్లా: ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది.. సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం సోమవారం గండిపేట చెరువుకు వెళ్లింది. అక్కడ సరదాగా కొంతసేపు గడిపారు. అయితే గండిపేట చెరువులోని నీళ్లను చూసిన బాలుడు నోమిన్ (15) ఒక్కసారిగా సంతోషం పట్టలేక నీళ్లలోకి దిగాడు.

TG News: బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా..

రంగారెడ్డి జిల్లా: ఈత (Swimming) సరదా ఓ బాలుడి (Boy) ప్రాణం తీసింది.. సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం సోమవారం గండిపేట చెరువు (Gandipet Pond)కు వెళ్లింది. అక్కడ సరదాగా కొంతసేపు గడిపారు. అయితే గండిపేట చెరువులోని నీళ్లను చూసిన బాలుడు నోమిన్ (15) ఒక్కసారిగా సంతోషం పట్టలేక నీళ్లలోకి దిగాడు. బాలుడు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ కేకలు వేశారు.


సమాచారం అందుకున్న నార్సింగ్ (Narsing) పోలీసులు (Police) ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి కోసం గాలించసాగారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. సరదా కోసం గండిపేటకు వచ్చిన బాలుడు ఆమెన్ నీళ్లలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పట్టించింది. ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్ 101వ జయంతి.. ఘనంగా నివాళులు..

ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలి: ఎర్రబెల్లి

ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

జగన్ సర్కార్ ఇందుకు మినహాయింపు..

చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 01:16 PM