Share News

బీటెక్‌ విద్యార్థి అదృశ్యం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:43 PM

బీటెక్‌ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

బీటెక్‌ విద్యార్థి అదృశ్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూలై 26: బీటెక్‌ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన పీసు వెంకట్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ, ఈడబ్ల్యుఎస్‌ కాలనీలో అద్దెకుంటూ భోగారంలోని హోలీమేరీ కాలేజ్‌లో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 25వ తేదీన గదిలో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో వెంకట్‌రెడ్డి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడి మామ జక్క మనోహర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:43 PM