రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:45 PM
బైక్పై వెళ్తూ లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి.
ఘట్కేసర్ రూరల్, జూలై 26: బైక్పై వెళ్తూ లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రీ-భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం, జైనపల్లికి చెందిన శ్రీచరణ్(19) ఘట్కేసర్ మండలం, అంకుషాపూర్లోని ఏసీఈ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాల నుంచి జైనపల్లికి వెళుతుండగా హెచ్పీసీఎల్ సమీపంలో ముందు వెళుతున్న లారీని వెనుకాల నుంచి ఢీకొట్టాడు. ఈప్రమాదంలో శ్రీచరణ్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.