తండ్రి ఆస్తి కాజేశారని కూతురు ఫిర్యాదు
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:43 PM
Daughter's complaint that father's property has been stolen
ఘట్కేసర్ రూరల్, జూలై 26: హత్యకు గురైన తన తండ్రి ఆస్తిని కాజేశారని గడ్డం మహేష్ అనే వ్యక్తి కూతురు గడ్డం తరుణి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత నెల 15న హత్యకు గురైన గడ్డం మహేష్కు సంబంధించిన బీరువాలోని డబ్బులు, ప్లాట్ల పేపర్లు, బంగారం, బుల్లెట్ బైక్లను బాబాయ్ గడ్డం విట్టల్ ఎత్తుకెళ్లారని తెలిపారు. పలుమార్లు అడిగినా తమకు ఇవ్వడం లేదని తరుణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.