ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ.10వేల జరిమానా
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:45 PM
ఓ విద్యార్థి చేతికి కట్టుకున్న దారాన్ని తీసివేయాలని ఆదేశించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తాండూరు కోర్టులో న్యాయాధికారి రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పినట్లు బషీరాబాద్ ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు.
తాండూరు కోర్టులో తీర్పు
బషీరాబాద్, జూలై 26: ఓ విద్యార్థి చేతికి కట్టుకున్న దారాన్ని తీసివేయాలని ఆదేశించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తాండూరు కోర్టులో న్యాయాధికారి రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పినట్లు బషీరాబాద్ ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు. మండలంలోని మైల్వార్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థికి తరగతి గదిలో చేతికి కట్టుకున్న దారాన్ని తీయాలని 2022 సంవత్సరంలో ఆదేశాలు జారీచేశారు. ఈ విషయం అప్పట్లో వివాదస్పదమైంది. ఈ క్రమంలో అప్పట్లో పోలీసు కేసు నమోదైంది. పూర్వాపరాలు విన్న న్యాయాధికారి సదరు ఉపాధ్యాయుడికి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ వెల్లడించారు.