లారీ-కారు ఢీ.. ఒకరు దుర్మరణం
ABN , Publish Date - May 09 , 2024 | 12:52 AM
లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో భర్త అక్కడే మృతిచెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
కందుకూరు, మే 8 : లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో భర్త అక్కడే మృతిచెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మలక్పేట ప్రాంతానికి చెందిన చింతలపాటి దుర్గా ప్రసాద్(65) భార్య నాగనిశ్చల(58)లు కారులో కందుకూరు నుంచి హైదరాబాద్ వైపు బుధవారం సాయంత్రం వెళుతుండగా మండలంలోని కొత్తూరు వాగు సమీపంలో హైదరాబాద్ నుంచి వస్తున్న లారీని కారు బలంగా ఢీకొంది. కారులో ఉన్న దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా నాగనిశ్చలకు తీవ్ర గాయాలయ్యాయి. కందుకూరు ఎస్సై సైదులు కేసు నమోదు చేసుకొని తీవ్రగాయాలైన నాగనిశ్చలను నగరంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.