మహిళ అదృశ్యం.. కేసు నమోదు
ABN , Publish Date - May 09 , 2024 | 12:50 AM
శంషాబాద్ మండలంలోని గొల్లపల్లికి చెందిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు..
శంషాబాద్ రూరల్, మే 8 : శంషాబాద్ మండలంలోని గొల్లపల్లికి చెందిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గొల్లపల్లి గ్రామానికి చెందిన సంపంగి ప్రవీణ్, మాధవిలు దంపతులు. మంగళవారం రాత్రి ఇంట్లో ప్రవీణ్, మాధవి వారి పిల్లలతో కలిసి నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున 3.40 నిమిషాలకు పెద్ద కుమారుడు యశ్వంత్కు మెళకువ వచ్చింది. అతడు తన తల్లి తన పక్కన లేకపోవడంతో తండ్రికి చెప్పాడు. వెంటనే ప్రవీణ్ చుట్టుపక్కల, బంధువులకు సమాచారం చేరవేసినా ఫలితం లేకపోయింది. కాగా, ఆమె ఇంట్లో నుంచి వెళ్లిన సమయంలో బ్లూకలర్ దుస్తులు ధరించి ఉందని, తెలుగులో మాట్లాడుతుందని, ఎత్తు ఐదు అడుగులు ఉంటుందని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ పోలీసులు చెప్పారు.