Share News

కొనసాగుతున్న గ్రూపు-1 పరీక్షలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:47 PM

నగర శివారు మొయినాబాద్‌ మండల పరిధిలోని నాలుగు కేంద్రాల్లో గ్రూపు-1 పరీక్ష మూడవ రోజు బుధవారం సజావుగా జరిగింది.

కొనసాగుతున్న గ్రూపు-1 పరీక్షలు
పరీక్షా కేంద్రం వద్ద అధికారులు

మొయినాబాద్‌ రూరల్‌, అక్టోబరు 23: నగర శివారు మొయినాబాద్‌ మండల పరిధిలోని నాలుగు కేంద్రాల్లో గ్రూపు-1 పరీక్ష మూడవ రోజు బుధవారం సజావుగా జరిగింది. అజీజ్‌ నగర్‌ చౌరస్తాలోని వీజేఐటీ కళాశాల సెంటర్‌లో 984 అభ్యర్థులకు గాను 590, భాస్కర ఇంజనీరింగ్‌ కళాశాలలో 816 మందికి గాను 451, కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో 1200 మందికి గాను 717 మంది పరీక్ష రాసినట్లు తహసీల్దార్‌ గౌతమ్‌ కుమార్‌ తెలిపారు. తహసీల్దార్‌ గౌతమ్‌ కుమార్‌, సీఐ పవన్‌ కుమార్‌ రెడ్డి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - Oct 23 , 2024 | 11:47 PM