Share News

‘ఎస్టీ డిక్లరేషన్‌’ను అమలు చేయాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:53 PM

ఎస్టీ డిక్లరేషన్‌ హామీని వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బనావత్‌ సాయిలాల్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు.

‘ఎస్టీ డిక్లరేషన్‌’ను అమలు చేయాలి

రంగారెడ్డి అర్బన్‌, జూలై 26 : ఎస్టీ డిక్లరేషన్‌ హామీని వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బనావత్‌ సాయిలాల్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌డ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 ఆగస్టు 26న చేవెళ్ల బహిరంగ సభలో ప్రకటించిన ట్రైబల్‌ డిక్లరేషన్‌ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇచ్చిన హామీని అమలు చేస్తానని చెప్పినా.. నేడు ఎస్టీలను విస్మరిస్తున్నారని అన్నారు. ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన అంశాలను వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Updated Date - Jul 26 , 2024 | 11:53 PM