Share News

సెల్‌ఫోన్‌ దుకాణంలో దొంగతనం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:48 PM

మోకిలలోని బాలాజీ మొబైల్‌ దుకాణంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. దుకాణం షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి 30 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం..

సెల్‌ఫోన్‌ దుకాణంలో దొంగతనం

30 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన దుండగులు

శంకర్‌పల్లి, జూలై 26: మోకిలలోని బాలాజీ మొబైల్‌ దుకాణంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. దుకాణం షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి 30 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన జీవన్‌ కుమావత్‌ మూడేళ్ల క్రితం మోకిలలో అద్దె రూమ్‌ తీసుకొని మొబైల్‌ షాప్‌ నడుపుతున్నాడు. గురువారం రాత్రి దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం తాళాలు పగులగొట్టబడి ఉండటంతో స్థానికులు గమనించి జీవన్‌ కుమావత్‌కు సమాచారం ఇచ్చారు. అతడు దుకాణంలోకి వెళ్లిచూడగా విలువైన ఫోన్లు, నగదు పోయిందని బోరున విలపించాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:48 PM