Share News

Road Accident: డీసీఎంను ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం..

ABN , Publish Date - Jul 15 , 2024 | 07:49 AM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎంను ఢీకొని ధర్మవరం డిపోకు చెందిన బస్సు దగ్ధమైంది.

Road Accident: డీసీఎంను ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం..

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎంను ఢీకొని ధర్మవరం డిపోకు చెందిన బస్సు దగ్ధమైంది. డీసీఎం డీజిల్ ట్యాంక్ పేలడంతో నిప్పు అంటుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే బస్సు నుంచి ప్రయాణికులు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 15 మంది ప్రయాణికులకు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్ హైదరాబాద్ నుంచి ధర్మవరానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Updated Date - Jul 15 , 2024 | 07:49 AM