Share News

Education Commission: విద్యా కమిషన్‌ సభ్యుడిగా విశ్వేశ్వర్‌రావు

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:12 AM

మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి చైర్మన్‌గా ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Education Commission: విద్యా కమిషన్‌ సభ్యుడిగా విశ్వేశ్వర్‌రావు

  • మరో ఇద్దరు సభ్యులనూ నియమించిన సర్కారు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి చైర్మన్‌గా ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు చారుగొండ వెంకటేష్‌, జ్యోత్స్నా శివారెడ్డిలను సభ్యులుగా నియమించింది. విద్యా కమిషన్‌లో సభ్యుడిగా విశ్వేశ్వర్‌రావును తీసుకోవడం ద్వారా టీజేఎ్‌సకు మరో నామినేటెడ్‌ పోస్టును సీఎం రేవంత్‌రెడ్డి కేటాయించినట్లయింది. కాగా, కోదండరెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన రైతు కమిషన్‌కూ ఒకటి, రెండు రోజుల్లో సభ్యులను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - Oct 19 , 2024 | 04:12 AM