Share News

TS News: పరిగిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Jul 06 , 2024 | 10:55 AM

పరిగిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందట. ఆలయ దుకాణ సముదాయాల అద్దెల విషయంలో ఎండోమెంట్ అధికారులు పాత దేవాలయ కమిటీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

TS News: పరిగిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉద్రిక్తత

వికారాబాద్: పరిగిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందట. ఆలయ దుకాణ సముదాయాల అద్దెల విషయంలో ఎండోమెంట్ అధికారులు పాత దేవాలయ కమిటీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అద్దెలు కట్టడం లేదంటూ దుకాణ సముదాయాలను తమ ఆధీనంలోకి ఎండోమెంట్ అధికారులు తీసుకుంటున్నారు. దుకాణాలకు తాళాలు వేసి దేవాదాయ శాఖ సీజ్ చేసింది. అద్దెకు ఉండే వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా దేవాదాయ శాఖ అడ్డుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. ఎండోమెంట్ అధికారులకు కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆధీనంలో దేవాలయ కమిటీ ఉంది. గొడవ రాజకీయ రంగు పులుముకుంది.

Updated Date - Jul 06 , 2024 | 10:55 AM