Share News

Bhadrachalam: శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శనం...

ABN , Publish Date - Jul 02 , 2024 | 07:54 AM

భద్రాద్రిలో కొలువైన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం భక్తులకు లభించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా భద్రాచలంలోనూ బ్రేక్ దర్శనం భక్తులకు కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేటి నుంచే ఈ బ్రేక్ దర్శన అవకాశాన్ని కల్పించనున్నారు.

Bhadrachalam: శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శనం...

భద్రాచలం: భద్రాద్రిలో కొలువైన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం భక్తులకు లభించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా భద్రాచలంలోనూ బ్రేక్ దర్శనం భక్తులకు కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేటి నుంచే ఈ బ్రేక్ దర్శన అవకాశాన్ని కల్పించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకూ.. రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు. బ్రేక్ దర్శనం సమయంలో ఎటువంటి పూజలూ ఉండవని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్ ధర 200 రూపాయలుగా దేవస్థానం అధికారులు నిర్ణయించారు.

Updated Date - Jul 02 , 2024 | 07:54 AM