Share News

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:05 AM

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

చెన్నై, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని తమిళనాడులోని వేలూరుకు చెందిన వీఐటీ సాంకేతిక విశ్వవిద్యాలయం నిర్వాహకులు సంకల్పించారు. ఆ మేరకు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక చాన్సలర్‌ డాక్టర్‌ కె. విశ్వనాధన్‌, ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాధన్‌ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుసుకుని రూ.1.50 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వీఐటీ విశ్వవిద్యాలయ నిర్వాహకులు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా హర్షం వెలిబుచ్చారు.

Updated Date - Sep 09 , 2024 | 04:05 AM