Home » Chennai
గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎక్కడికో బయల్దేరాం! దారిలో ఒక ఫ్లై ఓవర్ కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఏమో.. నేరుగా వెళ్లాలని చెబుతుంది. నేరుగా అంటే.. ఫ్లై ఓవర్ ఎక్కాలా? లేక ఫ్లై ఓవర్ పక్కగా కింద నుంచి వెళ్లాలా? అర్థం కాదు.
భోజనం పార్శిల్తో పాటు ఊరగాయ ఇవ్వని ఓ హోటల్కు వినియోగదారుల ఫోరం రూ.35 వేల జరిమానా విధించింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్యస్వామి అనే వ్యక్తి ఓ ఆశ్రమానికి అందించేందుకు విల్లుపురంలోని ఓ ప్రముఖ హోటల్లో 25 భోజనాలు కొనుగోలు చేశారు.
రాజకీయాల కంటే పోలీస్ ఉద్యోగమే మేలనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన కూడా వస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(Bharatiya Janata Party state president K. Annamalai) తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఖరీదైన వస్తువులను ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. అలాంటప్పుడు కోపం, ఆందోళన రావడం సహజమే. కానీ ఓ వ్యక్తి చాకచక్యం.. పోయిందనుకున్న ఖరీదైన వస్తువు తిరిగి వచ్చేలా చేసింది.
తాను పదవీ విరమణ చేశానే తప్ప, పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదిన వేడుకలు, 50 ఏళ్లుగా రాజకీయాల్లో రాణించినందుకుగాను చెన్నైలో శనివారం సాయంత్రం ఆయన్ని నగరానికి చెందిన ప్రముఖులు సత్కరించారు.
ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఐఐటీ మద్రాస్ నుండి పీహెచ్డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.
అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
చెన్నై నగర శివారు ప్రాంతం మాధవరం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకేసు నిందితుడు తిరువేంగడం హతమయ్యాడు. ఈ నెల 5వ తేదీ ....
తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. పట్టపగలు కీలక నేత హత్య జరగడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్కౌంటర్కు(encounter) గురయ్యాడు.
దేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారిగా.. ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్పించుకున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎం.అనుసూయ..