Home » AIADMK
పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే 'రెండాకుల' ఎన్నికల గుర్తుకు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.
కోట్లాదిమంది ప్రజలు, కార్యకర్తల ఆదరాభిమానాలున్న అన్నాడీఎంకే(AIADMK)ను నాశనం చేస్తామంటూ శపథాలు చేసినవారంతా అడ్రస్ లేకుండా పోయారని, ఈ విషయం తెలిసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ పార్టీ నేతపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి డి. జయకుమార్(Former Minister D. Jayakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కళ్లకుర్చి కల్తీసారా సంఘటనతో తనకు, తన వర్గానికి సంబంధాలున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతిని జైలుకు పంపి తీరుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నామలై కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధ్వజమెత్తారు.
విక్రవాండి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నాడీఎంకేను పతనావస్థకు తీసుకెళుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి అందరి వద్దా ‘నమ్మకద్రోహి’ అనే పేరు తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) నోటి దురుసు వల్లే రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయిందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former minister SP Velumani) పేర్కొన్నారు.
తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.
గడిచిన దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యమని ఇటీవల అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami) విమర్శించారు. నీలగిరి లోక్సభ స్థానం నుంచి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న లోకేశ్ తమిళ్ సెల్వన్కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు.
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్సెల్వం, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ ఊసరవెల్లిలా తరచూ రంగులు మారుస్తుంటారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) తీవ్రంగా విమర్శించారు.