Home » Andole
పట్టపగలే.. అదీ పోలీస్ స్టేషన్ ఎదుటే భారీ చోరీ జరిగింది.ఆపి ఉన్న కారు అద్దాలు పగులకొట్టి దొంగలు ఏకంగా రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు.
జీవితానికి బాటలు వేసిన బడికి పూర్వ విద్యార్థులు తోచిన సాయం అందించడం చూస్తూనే ఉంటాం. వారిని చూసి స్ఫూర్తిపొంది మరికొందరు సాయం చేయడానికి ముందుకు రావడం సహజమే.
సైబారాబాద్ మాజీ (రిటైర్డ్) పోలీస్ కమిషనర్ ప్రభాకర్రెడ్డి, మరో ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి 57.12 ఎకరాల భూమిని రూ.22.23 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఓ కేటుగాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అందోలులో వెలుగుచూసింది.
నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా అందోల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది.
సంగారెడ్డి జిల్లా అందోల్ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
అందోల్లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.
పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది.
సంగారెడ్డి జిల్లా అందోల్లోని రంగనాయకసాగర్ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని నాగిరెడ్డి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.