Home » AP New Cabinet
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సుమారు 20 నిమిషాల పాటు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు.విజయవాడ సహా... రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదలతో సంభవించిన నష్టంపై కేంద్ర మంత్రికి వివరాలు తెలిపారు.
సకాలంలో కౌంటర్లు వేయకుండా జాప్యం చేస్తే ఇకపై ఖర్చులు విధిస్తామని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. వివిధ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.
ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాదేస్తోందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. ఎంపీలుగా గెలిచిన ఆ ఆనందం ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంతోషం లేకుండా పోయిందని చెప్పారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.
ఎన్టీఆర్ భవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savita) వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ నేతలే ఇంకా తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జులై 8వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Andhrapradesh: జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఏడవ సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా.. ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పెన్షన్లు అందని పరిస్థితి. అందుకు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ చెప్పిన కారణం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి (Minister Kolusu Partha Saradhi) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను స్వయంగా ఇవ్వనున్నారు.
అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ క్యాంటీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ మేరకు స్థలాల సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే కొన్నిటిని గుర్తించామని వివరించారు.