Share News

Minister Savita: వైసీపీ నేతలు ఇంకా దాడులు చేస్తున్నారు

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:35 PM

ఎన్టీఆర్ భవన్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savita) వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ నేతలే ఇంకా తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

 Minister Savita: వైసీపీ  నేతలు ఇంకా దాడులు చేస్తున్నారు
Minister Savita

అమరావతి: ఎన్టీఆర్ భవన్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savita) వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ నేతలే ఇంకా తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానంగా భూ కబ్జాలు, పోలీస్ పోలీసుల వేధింపులు, గంజాయి బారిన బిడ్డల పైనే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారని తెలిపారు.వైసీపీ శ్రేణులపై ఒక్క అక్రమ కేసు కూడా తాము పెట్టట్లేదని చెప్పారు.


వైసీపీ బాధితులు ఎందరో తమ వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తురని అన్నారు.కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారులు, న్యాయ నిపుణుల సలహాతో తీసుకుని పరిష్కరిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ భవన్‌లో మంత్రి సవిత వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ నేతలే ఇంకా తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. కక్షసాధింపు చర్యలు వద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలతో తమ వాళ్లు ఎదురుతిరగట్లేదని తెలిపారు. వైసీపీ శ్రేణులపై ఒక్క అక్రమ కేసు కూడా తాము పెట్టట్లేదని మంత్రి తెలిపారు..


కాగా.. ప్రజా సమస్యలపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నేతలు వినతులు స్వీకరించనున్నారు. రేపటి(బుధవారం) నుంచి ప్రతిరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయనున్నారు. ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ కార్యాలయంలో తప్పనిసరిగా మంత్రులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల ,ప్రజల కోసం కేంద్ర కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. 10 రోజులు పాటు రోజుకో మంత్రి , ఒక సీనియర్ టీడీపీ నేత అందుబాటులో ఉండే విధంగా అధిష్ఠానం కార్యాచరణ రూపొందించింది.


వినతులు స్వీకరించనున్న మంత్రులు వీరే..

18వ తేదీ.... ఎన్ఎండీ ఫరూక్

22వ తేదీ.. గుమ్మడి సంధ్యారాణి

23 వ తేదీ ..కొల్లు రవీంద్ర

24 వ తేదీ– అనగాని సత్యప్రసాద్

25వ తేదీ ..వాసంశెట్టి సుభాష్

29వ తేదీ కొండపల్లి శ్రీనివాస్

30 వ తేదీ.. మండపల్లి రాంప్రసాద్ రెడ్డి

31 వ తేదీ– బి.సి. జనార్ధన్ రెడ్డి

19, 26వ తేదీల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వినతులు స్వీకరించనున్నారు.


టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న జాతీయ నాయకులు

17వ తేదీ బొల్లినేని రామారావు

18వ తేదీ ..వైకుంఠం ప్రభాకర్ చౌదరి

22.. వ తేదీ.. కావలి ప్రతిభ భారతి

23 వ తేదీ ..శ్రీ కొట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

24వ తేదీ.. శ్రీ బీద రవిచంద్ర

25 వ తేదీ ..శ్రీ కె.ఎస్ జవహార్

29వ తేదీ... పనబాక లక్ష్మి

30వ తేదీ... శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు

31 వ తేదీ...శ్రీమతి తోటా సీతారామ లక్ష్మి

Updated Date - Jul 17 , 2024 | 09:36 PM