Home » Buddha Venkanna
Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశామని... గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకలశాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బద్రర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబితేనే తాను, బోండా ఉమా మాచర్లకి వెళ్ళామని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయిన రెండు నెలల్లోనే మతిభ్రమించిందని ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో డబ్బులతో విర్రవీగాడని, ఇప్పుడు అధికారం దూరం కావడంతో పిచ్చినట్టు అవుతుందో ఏమోనని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను జగన్ అవమానించారని మండిపడ్డారు.
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బద్దా వెంకన్న(Badda Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: ఎంపీ కేశినేని పుట్టిన రోజు వేడుకులను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ... పదవి లేక పోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు.
Andhrapradesh: జర్నలిస్టులు, మీడియాపై రాజ్యసభ సభ్యులు విజసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్ను టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుబట్టారు.
విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.
టీడీఆర్ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
విజయవాడ: టీడీఆర్ బాండ్ల కంభకోణంలో జగన్ను అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు.