Home » Deputy CM Pawan Kalyan
విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (X) ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23న ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.
నరసాపురం ప్రజలు డంపింగ్ యార్డ్ లేక దశాబ్దాలుగా అవస్థలు పడ్డారని, పెండింగ్లో ఉండిపోయిన ఆ సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలంటూ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన రెండ్రోజుల్లోనే రూ.1.74కోట్లు అత్యవసర నిధి కింద విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని పవన్ అన్నారు.
అండమాన్ నికోబార్ దీవుల పేరు మార్పు అంశంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇన్నాళ్లకు ఇంగ్లిష్ పేరు నుంచి విముక్తి కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయపురం" గా కేంద్రప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.
70 ఏళ్లు పైబడిన వారందకీ రూ.5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ ఆమోదించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వామపక్ష యోధుడు సీతారామ్ ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సీతారామ్ ఏచూరి దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కలుసుకున్నారు.
AP Deputy CM Pawan Kalyan - Telangana CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి వచ్చిన పవన్.. ఆయనను కలిశారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఆ విశేషాలేంటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
Andhrapradesh: ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై చర్చించారు. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు.
ఏలేరు రిజర్వాయర్ కన్నెర్ర జేసింది. కాకినాడ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో వరద ముంచెత్తింది. పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావంతో కొన్ని కాలనీలు నీటమునగగా, వేలాది ఎకరాల్లో పంట వరద పాలైంది.