Home » Diwali
ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు.
దీపావళి, చాత్ పూజ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు మళ్లీ స్వస్థలాలకు చేరేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయని తెలిపింది.
Bank Holidays in October 2024: టెక్నాలజీ పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్లోనే పూర్తి చేస్తున్నారు ప్రజలు. డబ్బులు పంపాలన్నా.. డబ్బులు పొందాలన్నా.. యూపీఐ పేమెంట్స్తో నిమిషాల్లో పని పూర్తైపోతుంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది.
రానున్న దసరా, దీపావళి, ఛాట్ ఫెస్టివల్స్(Dussehra, Diwali, Chat Festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి 48 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
పండుగకు ఎప్పుడు వస్తున్నావ్ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.
పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
దసరా, దీపావళి, క్రిస్మస్, ఛాట్(Dussehra, Diwali, Christmas, Chat).. తదితర పండుగల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే పరిధిలో నడుస్తున్న 60ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం ( ఈ నెల18న) దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి.
దీపావళి పండుగ(Diwali festival) కోసం తమ సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు సోమవారం రాత్రి నుంచి చెన్నైకి తిరుముఖం పట్టారు.