Home » DK Aruna
‘‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి భయమెందుకు?. ఎవరికి భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ప్రశ్నించారు.
వక్ఫ్ బోర్డు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తున్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బోడుప్పల్ ఆర్ఎంఎస్ కాలనీలో వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు(శనివారం) నిర్వహించారు.
‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా డ్రామా ఆడుతోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
వక్ఫ్ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎంతమంది గులాబీ పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే..
Telangana: రేవంత్ సర్కార్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై పార్లమెంట్ సభ్యురాలు డీ.కే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసిందని అన్నారు.
‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఉద్ఘాటించారు.
రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.