Home » GDP
కార్యకలాపాల్లో వేగవంతమైన పురోగమనం, అధిక వ్యాపార వృద్ధి కారణంగా భారతదేశ సేవల రంగం వృద్ధి ఆగస్టులో పుంజుకుంది. ఈ క్రమంలో ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని బుధవారం విడుదల చేసిన వ్యాపార సర్వే తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది.
బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.
S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ(india) GDP వృద్ధి రేటు అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉండటం విశేషం.
దేశ జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేయగా.. ఈ గణాంకాలపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ(GDP) వృద్ధి రేటు 8.2 శాతానికి చేరుకుందని ప్రకటించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సూచనగా ఆయన పేర్కొన్నారు.
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.
భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది.
దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోనుంది. జీడీపీ అంచనాలు గతేడాది ఇదే సమయంతో పోల్చితే రెండింతలు పెరగడం శుభ పరిణామమని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) ఏడాది ప్రాతిపదికన 8.4 శాతానికి చేరుకుందని గురువారం కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరో నాలుగేళ్లలో భారత్ జీడీపీ (India GDP) 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని.. 2027 నాటికి జపాన్ (Japan), జర్మనీలను (Germany) అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘జెఫరీస్ గ్రూప్’ (Jefferies Group) తెలిపింది.