Home » INDIA Alliance
లోక్సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అయితే ఈ చట్టాలు అమలు చేసే ముందు ఉభయ సభల్లో సరైన చర్చ జరగలేదని విపక్షాల నుంచి ప్రధానంగా ఎదురవుతున్న ఆరోపణ. ఈ ఆరోపణల్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఖండించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.
లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమాజ్వాదీపార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
నీట్ పరీక్ష నిర్వహణలో(NEET Paper Leakage) అవకతవకలఅంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని డిమాండ్ చేశారు.
దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.
స్పీకర్ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్సభలో గందరగోళం నెలకొంది.
లోక్సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.